ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ
ABN , First Publish Date - 2021-07-25T07:16:28+05:30 IST
ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో స్ధానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రతిభ చూపారు.
దొనకొండ, జూలై 24 : ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో స్ధానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రతిభ చూపారు. సీఈసీ గ్రూపులో మోడి.పూజిత 863/1000, ఎం.శివపార్వతి 853/1000, హెచ్ఈసీ గ్రూపులో కె.ప్రసన్న 834/1000 మార్కులు సాధించినట్లు ప్రిన్సిపల్ ఏ.ఆంజనేయులు తెలిపారు.
మండల స్థాయిలో రిజ్వానాకు మొదటి ర్యాంకు
పామూరు : ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాల్లో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన షేక్ రిజ్వానా బైపీసీ విభాగంలో 1000/910 మార్కులతో మండలస్థాయి ర్యాంకు సాఽఽధించినట్లు ప్రిన్సిపాల్ ఎస్డీ జిలానీబాష తెలిపారు. తమ విద్యార్థిని అత్యధిక మార్కులు సాధించి కళాశాలకు గుర్తింపు తెచ్చిందన్నారు
వీకే. జూనియర్ కళాశాల విద్యార్థి ప్రతిభ
తాళ్లూరు : ఇంటర్ సెకండియర్ ఒకేషనల్ కోర్సు ఫలితాల్లో తాళ్లూరు వీకే.జూనియర్ కళాశాలకు చెందిన పులి ఆనందకుమారి(973/1000) మార్కు లు సాధించి జిల్లా స్థాయిలో రెండవ ర్యాంకు సాధించినట్లు లెక్చరర్ నరసింహారావు శనివారం తెలిపారు. ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో ఒకేషనల్లో పులి ఆనందకుమారి(973/1000) మొదటిస్థానం, బొడ్డు అనూషా (954/1000) రెండవ స్థానం సాధించారు. జనరల్ విభాగం(సీఈసీ)లో షేక్ ఆష(866/1000) మొదటి స్థానం, కె.అనంత లక్ష్మి (828/1000)లు సాధించినట్లు తెలిపారు.