పిచ్చి కూతలు కూస్తే ఊరుకోం: Vinay

ABN , First Publish Date - 2021-11-14T16:14:20+05:30 IST

బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పిచ్చి కూతలు కూస్తే ఊరుకోం: Vinay

హనుమకొండ: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 60 లక్షల మంది టీఆర్ఎస్ కార్యకర్తలు తుమ్మితే ఆ తుంపిర్లలో బీజేపీ, కాంగ్రెస్ కొట్టుకుపోతాయన్నారు. పిచ్చి కూతలు కూస్తే ఊరుకోమని హెచ్చరించారు. ఉద్యమగొంతులను కేంద్రం అణగదొక్కాలని చూస్తోందన్నారు. కేంద్రం తాటాకు చప్పుళ్లకు భయపడబోమని తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు వరంగల్ ప్రజలను వంచించాయని విమర్శించారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రాకుండా చేశాయన్నారు .రైల్వే క్రూలింక్ లాబీని కూడా కాజీపేట నుంచి తరలించారని మండిపడ్డారు. కేంద్రం వైఖరిపై మరో ఉద్యమానికి యువత సిద్ధమౌతోందని తెలిపారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఒక టూరిస్ట్‌గా వచ్చారు తప్ప టూరిజానికి ఒక రూపాయి కేటాయించలేదని వినయ్ భాస్కర్ అన్నారు. 

Updated Date - 2021-11-14T16:14:20+05:30 IST