ఓరుగల్లు చైతన్య వంతమైన గడ్డ: Vinay bhaskar

ABN , First Publish Date - 2022-04-30T17:49:27+05:30 IST

బీజేపీపై ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఓరుగల్లు చైతన్య వంతమైన గడ్డ: Vinay bhaskar

హనుమకొండ: బీజేపీపై ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకురావడమే కాకుండా కార్మిక వ్యతిరేక విధానాలు అమలు పరుస్తు సంఘటిత, అసంఘటిత కార్మిక రంగాన్ని నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. కార్మికులకు భద్రత లేదన్నారు. ఓరుగల్లు చైతన్య వంతమైన గడ్డ అని తెలిపారు. ఇక్కడ ఏ పోరాటం మొదలు పెట్టినా గమ్యాన్ని ముద్దాడడం ఖాయమని స్పష్టం చేశారు. మే 1 నుండి నెలరోజుల పాటు కార్మిక చైతన్య మాసం జరపాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కార్మికులతో కలిసి కార్యాచరణ చేపట్టనున్నామన్నారు. 30న బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వినయ్ భాస్కర్ పేర్కొన్నారు.

Updated Date - 2022-04-30T17:49:27+05:30 IST