ఎంపీ గోరంట్ల మాధవ్‌పై ప్రభుత్వ తీరు దురదృష్టకరం

ABN , First Publish Date - 2022-08-10T05:33:21+05:30 IST

వీడియో కాల్‌లో ఓ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఎంపీ గోరంట్ల మాధవ్‌ తీరుపై ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరమని తెలుగు మహిళ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్వప్న మండిపడ్డారు.

ఎంపీ గోరంట్ల మాధవ్‌పై ప్రభుత్వ తీరు దురదృష్టకరం
మీడియాతో మాట్లాడుతున్న స్వప్న


వాస్తవాలు మాట్లాడే అనితకు బెదిరింపులు హేయం

 తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్వప్న 

అనంతపురం అర్బన, ఆగస్టు 9 : వీడియో కాల్‌లో ఓ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఎంపీ గోరంట్ల మాధవ్‌ తీరుపై ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరమని తెలుగు మహిళ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్వప్న మండిపడ్డారు. మంగళవా రం అనంతపురం అర్బన టీడీపీ కార్యాల యంలో ఆమె మాట్లాడుతూ.. విజయవా డలో అన్ని పార్టీలకు చెందిన మహిళల రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరుగుతున్న సమయంలో ఓ వైసీపీ నాయకుడు తెలుగు మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనితకు ఫోన చేసి బెదిరించడం సిగ్గుచేటన్నారు. అనితను బెదిరించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎంపీ గోరంట్ల మాధవ్‌తో పాటు ఇతర వైసీపీ ప్రజాప్రతినిధులు మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినా ప్రభుత్వం మిన్నకుండిపోవడం ఏమిటని నిలదీశారు.


Updated Date - 2022-08-10T05:33:21+05:30 IST