7న ఢిల్లీకి గవర్నర్
ABN , First Publish Date - 2022-02-05T13:53:14+05:30 IST
రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి ఈ నెల 7వ తేదీ ఢిల్లీ వెళ్లనున్నారు. మూడు రోజుల పర్యటన కోసం ఢిల్లీ వెళ్తున్న ఆయన.. సోమవారం మధ్యాహ్నం 1.20 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లి తిరిగి 9వ తేదీ సాయంత్రం చెన్నై రానున్నారు. ‘నీట్’ రద్దు
చెన్నై: రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి ఈ నెల 7వ తేదీ ఢిల్లీ వెళ్లనున్నారు. మూడు రోజుల పర్యటన కోసం ఢిల్లీ వెళ్తున్న ఆయన.. సోమవారం మధ్యాహ్నం 1.20 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లి తిరిగి 9వ తేదీ సాయంత్రం చెన్నై రానున్నారు. ‘నీట్’ రద్దు కోరుతూ రాష్ట్ర అసెంబ్లీ చేసిన ఏకగ్రీవ తీర్మానాన్ని తిప్పి పంపిన నేపథ్యంలో గవర్నర్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. నీట్ బిల్లును గవర్నర్ వెనక్కి తిప్పి పంపిన నేపథ్యంలో ముఖ్యమంత్రి స్టాలిన్.. శనివారం అఖిలపక్ష నేతలతో భేటీ కానున్నారు. అదే విధంగా న్యాయనిపుణులతోనూ చర్చించనున్నారు. కాగా బిల్లును వెనక్కి పంపిన గవర్నర్ వ్యవహారశైలిపై బీజేపీ, అన్నాడీఎంకే మినహా మిగిలిన పార్టీలన్నీ మండిపడుతున్న నేపథ్యంలో గవర్నర్ దేశరాజధానికి పయనమవుతున్నారు. అక్కడ ఆయన ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్షా తదితరులతో భేటీ కానున్నట్లు రాజ్భవన్ వర్గాలు పేర్కొన్నాయి. ఇదిలా వుండగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో శుక్రవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై రాజ్భవన్ వెళ్లి గవర్నర్తో భేటీ కావడం కొసమెరుపు. రాష్ట్ర గ్రామీణ విద్యార్థులను బలిగొంటున్న నీట్ను వ్యతిరేకిస్తున్న బిల్లును తిప్పి పంపిన గవర్నర్ను రీకాల్ చేయాలంటూ డీఎంకే ఇప్పటికే డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో గవర్నర్కు నైతిక మద్దతు పలికేందుకే అన్నామలై సమావేశ మైనట్లు తెలుస్తోంది.