గవర్నర్చే పుస్తకాల ఆవిష్కరణ
ABN , First Publish Date - 2022-01-30T15:43:04+05:30 IST
రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్.రవి తాజాగా రెండు పుస్తకాలను ఆవిష్కరించారు. హార్ట్ఫుల్నెస్ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా ‘యోగా ఉత్సవ్ - టైమ్లెస్ విజ్డమ్’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఏన్షియంట్ విజ్డమ్ ఆఫ్
అడయార్(చెన్నై): రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్.రవి తాజాగా రెండు పుస్తకాలను ఆవిష్కరించారు. హార్ట్ఫుల్నెస్ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా ‘యోగా ఉత్సవ్ - టైమ్లెస్ విజ్డమ్’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఏన్షియంట్ విజ్డమ్ ఆఫ్ ఇండియా అండ్ టీచ్ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ వ్యాప్తి కోసం ఈ ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా గవర్నర్ ఆర్.ఎన్.రవి ఈ పుస్తకాలను ఆయన ఆవిష్కరించారు. వీటిలో ‘ది అథెంటిక్ యోగా’, ‘టేల్స్ ఫ్రమ్ ది వేదాస్ అండ్ ఉపనిషద్స్’ ఉన్నాయి. ఈ పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమంలో అనేక మంది తత్వవేత్తలు, విద్యావేత్తలు, యోగా ఔత్సాహికులు, సంఘ సేవకులు తదితరులు పాల్గొన్నారు.