Governarకు బూస్టర్‌ డోస్‌

ABN , First Publish Date - 2022-01-14T14:26:48+05:30 IST

రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి, ఆయన సతీమణి బూస్టర్‌ డోస్‌ తీసుకున్నారు. గురువారం ఉదయం ఓమందూర్‌ ప్రభుత్వాస్పత్రికి వెళ్లిన గవర్నర్‌ దంపతులు అక్కడ వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. గవర్నర్‌ దంపతులను

Governarకు బూస్టర్‌ డోస్‌

అడయార్‌(చెన్నై): రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి, ఆయన సతీమణి  బూస్టర్‌ డోస్‌ తీసుకున్నారు. గురువారం ఉదయం ఓమందూర్‌ ప్రభుత్వాస్పత్రికి వెళ్లిన గవర్నర్‌ దంపతులు అక్కడ వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. గవర్నర్‌ దంపతులను ఆస్పత్రి నిర్వాహకులు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. వ్యాక్సిన్‌ వేసుకున్న తర్వాత గవర్నర్‌ వైద్యులకు, నర్సులకు ధన్యవాదాలు తెలిపారు. తర్వాత కారులో రాజ్‌భవన్‌కు బయలుదేరి వెళ్ళారు. ఇప్పటికే ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌, ప్రతిపక్ష నేత ఒ.పన్నీర్‌సెల్వం తదితర ప్రముఖులు కూడా బూస్టర్‌ డోస్‌ తీసుకున్న విషయం తెలిసిందే. 

Updated Date - 2022-01-14T14:26:48+05:30 IST