ప్రభుత్వ ఉద్యోగులకు సేవా పురస్కారాలు
ABN , First Publish Date - 2021-01-27T05:49:45+05:30 IST
ప్రభుత్వ శాఖలలో విధులు నిర్వహిస్తున్న పలువురు ఉద్యోగులకు గణతంత్ర దినోత్సవాన్ని సందర్భంగా ప్రభుత్వం ఉత్తమ సేవా పురస్కారాలను అందించింది.
రాజమహేంద్రవరం సిటీ, జనవరి 26: ప్రభుత్వ శాఖలలో విధులు నిర్వహిస్తున్న పలువురు ఉద్యోగులకు గణతంత్ర దినోత్సవాన్ని సందర్భంగా ప్రభుత్వం ఉత్తమ సేవా పురస్కారాలను అందించింది. స్థానిక కేంద్ర కారాగా రంలో విధులు నిర్వర్తిస్తున్న డిప్యూటీ సూపరింటెండెంట్ ఎస్.కమలాకర్, జైలర్ జి.వెంకటరమణ, ఆఫీస్ సూపరిం టెండెంట్ ఎస్.భుజంగరావు, డిప్యూటీ జైలర్ ఎస్కె నయూబ్, చీఫ్ హెడ్వార్డర్ పీవీ రమణ, హెడ్వార్డర్లు ఎ.సత్యనారాయణ, పీవీడీ శ్రీనివాస్, వార్డర్ నెం.136 ఎం.రా మకృష్ణ, వార్డర్ నెం:177 సీహెచ రాంబాబు, కె.అప్పలరావు, పి.శ్రీనివాస్లకు ఉత్తమ సేవా పురస్కారాలను అందజే శారు. అలాగే స్థానిక రైల్వేస్టేషన సీఐటీ కేశవభట్ల శ్రీనివా సరావుకు ఉత్తమ సేవా పురస్కారం లభించింది. విజయ వాడ రైల్వే డివిజన పరిధిలో కరోనా సమయంలో ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా అవార్డుకు ఎంపికయ్యా రు. రైల్వే డీఆర్ఎం పి.శ్రీనివాస్ అవార్డును అందించారు.