తాటి చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడి మృతి
ABN , First Publish Date - 2021-05-15T06:19:41+05:30 IST
తాటి చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడి మృతి
వేలేరు(ధర్మసాగర్) మే 14 : తాటిచెట్టు పైనుంచి పడి గీతకార్మికుడు బైరిశ్రీనివాస్ (40) శుక్రవారం మృతి చెందాడు. ఎస్సై నీలోజు వెంకటేశ్వర్లు వివరాల మేరకు.. వేలేరుకు చెందిన శ్రీనివాస్ గ్రామశివారులో రోజు వారీగా తాటి చెట్టు ఏక్కుతుండగా మోకు జారీ చెట్టుపై నుంచి కింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్రీనివా్సను ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. శ్రీనివా్సకు కుమారుడు, కూతురు ఉన్నారు.