ఎమ్మెల్యే వంశీపై వైసీపీ నేత గోసుల శివభరత్ రెడ్డి ఫైర్
ABN , First Publish Date - 2022-05-20T00:22:34+05:30 IST
ఎమ్మెల్యే వంశీపై వైసీపీ నేత గోసుల శివభరత్ రెడ్డి ఫైర్
విజయవాడ: ఎమ్మెల్యే వంశీపై వైసీపీ నేత గోసుల శివభరత్ రెడ్డి ఫైర్ అయ్యారు. జగన్ పాదయాత్రలో రోడ్లపై వంశీ పసుపు నీళ్లు చల్లించారని శివభరత్ మండిపడ్డారు. జగన్పై గౌరవం ఉంటే రాజీనామా చేసి రావాలని సూచించారు. ఏ ముఖం పెట్టుకుని వంశీ గడపగడపకు తిరుగుతున్నాడని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని తిట్టినందుకు తిరుగుతున్నాడా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే వంశీని కార్యకర్తలు ఛీ కొడుతున్నారని విమర్శించారు. వంశీ పక్కన ఉంటే మమ్మల్ని కూడా ఛీకొడతారని అన్నారు. వైసీపీ కార్యకర్తలను సస్పెండ్ చేయడానికి వంశీ అనుచరులు ఎవరు?, మీ అక్రమాలను నిలదీస్తే సస్పెండ్ చేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. జగన్ ఆదేశిస్తే గన్నవరం నుంచి పోటీ చేస్తానని శివభరత్ రెడ్డి అన్నారు.