అనుమానాస్పద స్థితిలో గూర్ఖా మృతి

ABN , First Publish Date - 2021-02-27T05:01:12+05:30 IST

డిచ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రాంపూర్‌ గేట్‌ సమీపంలో భవాని వైన్స్‌ వద్ద డిచ్‌పల్లికి చెందిన గూర్ఖా రాజుసింగ్‌ (47) అనుమానస్పద స్థితిలో మృతిచెందాడు.

అనుమానాస్పద స్థితిలో గూర్ఖా మృతి

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 26: డిచ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రాంపూర్‌ గేట్‌ సమీపంలో భవాని వైన్స్‌ వద్ద డిచ్‌పల్లికి చెందిన గూర్ఖా రాజుసింగ్‌ (47) అనుమానస్పద స్థితిలో మృతిచెందాడు. ముఖంపై కర్రలతో దాడిచేసినట్లు ఆనవాలు కనిపిస్తున్నాయని, స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలాన్ని సందర్శించిన ఎస్సై గూర్ఖా శవానికి పంచనామా చేశారు. అనంతరం ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. ఎస్సై సురేష్‌కుమార్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2021-02-27T05:01:12+05:30 IST