డీజీపీ నియంతలా వ్యవహరిస్తున్నారు: గోరంట్ల

ABN , First Publish Date - 2021-01-16T19:51:05+05:30 IST

డీజీపీ గౌతమ్ సవాంగ్ నియంతలా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు.

డీజీపీ నియంతలా వ్యవహరిస్తున్నారు: గోరంట్ల

రాజమండ్రి: డీజీపీ గౌతమ్ సవాంగ్ వ్యాఖ్యలను టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఖండించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డీజీపీ నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ, బీజేపీ కార్యకర్తలపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి.. భయబ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. సంక్రాంతి సంబరాల ముసుగులో కోడిపందాలు, అశ్లీల నృత్యాలు చేస్తున్న వారిపై.. డీజీపీ ఎందుకు కేసులు పెట్టడం లేదని ప్రశ్నించారు. ఆలయాలపై దాడులు చేసిన వారిని అరెస్ట్ చేయలేని.. చేతకాని స్థితిలో పోలీసులు ఉన్నారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు.

Updated Date - 2021-01-16T19:51:05+05:30 IST