వైసీపీ ప్రభుత్వంపై బుచ్చయ్యచౌదరి ఫైర్

ABN , First Publish Date - 2022-04-27T22:07:03+05:30 IST

వైసీపీ ప్రభుత్వంపై బుచ్చయ్యచౌదరి ఫైర్

వైసీపీ ప్రభుత్వంపై బుచ్చయ్యచౌదరి ఫైర్

అమరావతి: ముఖ్యమంత్రి ఇంటికి సమీపంలోనే  విజయవాడలో అత్యాచారం జరిగితే నిందితులపై ఎటువంటి కఠిన చర్యలు తీసుకోవడం లేదని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. ప్యాక్షన్ ముఖ్యమంత్రి పాలనలో మహిళలకు రక్షణ లేదన్నారు. వైసీపీ మూడేళ్ల పాలనలో 1500 మంది మహిళల పై అత్యాచారాలు జరిగాయని ఆరోపించారు.  దిశ చట్టం వల్ల ఎంతమంది బాదిత మహిళలకు న్యాయం జరిగిందో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. వాసిరెడ్డి పద్మ, రోజా, లక్ష్మీపార్వతిలు ఫెయిడ్ ఆర్టిస్ట్ లని విమర్శించారు. మహిళలను వేధించే వారిపై మహిళలు తిరగబడాలని సూచించారు. నడిరోడ్డుపై చెప్పుతో కొట్టాలని సూచించారు. మహిళలకు టీడీపీ అండగా ఉంటుందన్నారు. మహిళలకు రక్షణ కల్పించలేని ముఖ్యమంత్రిని పదవి నుంచి తప్పించాలన్నారు.  

Updated Date - 2022-04-27T22:07:03+05:30 IST