చంద్రబాబును విమర్శించే అర్హత కొడాలి నానీకి లేదు : గోపు ధ్వజం
ABN , First Publish Date - 2022-07-01T06:43:18+05:30 IST
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించే అర్హత ఎమ్మెల్యే కొడాలి నానికి లేదని టీడీపీ మచిలీపట్నం పార్లమెంటు తెలుగురైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ ధ్వజమెత్తారు.
మచిలీపట్నం టౌన్ : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించే అర్హత ఎమ్మెల్యే కొడాలి నానికి లేదని టీడీపీ మచిలీపట్నం పార్లమెంటు తెలుగురైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ ధ్వజమెత్తారు. మచిలీపట్నం పార్లమెంటు టీడీపీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వారసులు, వారసత్వ రాజకీయాలపై కొడాలి నాని మచిలీపట్నం వైసీపీ ప్లీనరీలో కొత్త భాష్యం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కొడాలి నాని సమర్థుడయితే సీఎం జగన్మోహనరెడ్డి రెండోసారి అతడికి మంత్రి పదవి ఇచ్చేవారన్నారు. మినీ మహానాడు కార్యక్రమాలు వైసీపీ నాయకుల గుండెల్లో దడలు పుట్టిస్తున్నాయని, ఇది తట్టుకోలేక లేనిపోని ప్రేలాపనలు పేలుతున్నారన్నారు. మచిలీపట్నం పార్లమెంటు కార్యాలయ కార్యదర్శి బత్తిన దాసు, టీడీపీ మచిలీపట్నం పార్లమెంటు ప్రచా ర కార్యదర్శి పి.వి. ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు.