ఇళ్లు, స్థలాలు కబ్జా చేయడం గూండాల ప్రవృత్తి: పవన్
ABN , First Publish Date - 2022-07-10T19:04:39+05:30 IST
విజయవాడ: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడలో 'జనవాణి-జనసేన భరోసా' కార్యక్రమం నిర్వహించారు. పలువురు బాధితులు తమ సమస్యలపై ఆయనకు వినతిపత్రాలు అందజేశారు. వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పవన్ వారికి హామీ ఇచ్చారు.
విజయవాడ: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడలో 'జనవాణి-జనసేన భరోసా' కార్యక్రమం నిర్వహించారు. పలువురు బాధితులు తమ సమస్యలపై ఆయనకు వినతిపత్రాలు అందజేశారు. వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పవన్ వారికి హామీ ఇచ్చారు.
పేదల కోసమే కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్
‘‘రేణిగుంట తారకరామానగర్లో ఓ కుటుంబానికి 2004లో వైయస్ ప్రభుత్వం ఇల్లు ఇచ్చింది. ఆ ఇంటిని లాక్కునెందుకు వైసీపీ ఎంపీటీసీ దౌర్జన్యం చేశారు. ఇలాంటి ఘటనలో తరుచూ జరుగుతున్నా.. యథా రాజా తథా ప్రజా రీతిలో వైసీపీ పాలన సాగుతోంది. ఈ తరహా ఘటనల వల్లే తీవ్రవాద ఉద్యమాలు పుట్టుకొస్తాయి. అధికార మదంతో ఇలా చేస్తారని నేను గతంలోనే చెప్పాను. పేదల ఇబ్బందులు, సమస్యల పరిష్కారం కోసమే కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టా. హోం మంత్రి, అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలి. వైసీపీ నాయకులు, కార్యకర్తలు నన్ను చాలా రకాలుగా బెదిరిస్తున్నారు. నేను వారికి భయపడను... పేదల జోలికి వస్తే ఊరుకోను’’ అని పవన్ హెచ్చరించారు.