ఆర్యవైశ్య సంఘ మాజీ అధ్యక్షుడు ‘గోళ్ల’మృతి

ABN , First Publish Date - 2021-04-19T06:14:39+05:30 IST

ఎర్రగొండపాలెం పట్టణ ఆర్య వైశ్య సంఘం మాజీ అ ధ్యక్షుడు గోళ్ల చిన్న వెంకటసుబ్బయ్య (88) గుండెపోటుతో ఆదివారం మృతి చెందారు.

ఆర్యవైశ్య సంఘ మాజీ అధ్యక్షుడు ‘గోళ్ల’మృతి


ఎర్రగొండపాలెం, ఏప్రిల్‌ 18 : ఎర్రగొండపాలెం పట్టణ ఆర్య వైశ్య సంఘం మాజీ అ ధ్యక్షుడు గోళ్ల చిన్న వెంకటసుబ్బయ్య (88) గుండెపోటుతో ఆదివారం  మృతి చెందారు.  10 రోజులు క్రితం అస్వస్థతకు గురికా వడంతో ఆయన్ని స్థానిక ప్రైవేటు వైద్యశాల లో  చికిత్స చేయించారు. మెరుగైన వైద్యం కోసం గుంటూరులోని అమృత వైద్యశాలలో వైద్య సేవలు పొందుతున్నారు. ఆదివారం ఉ దయం వైద్యశాల డాక్టర్లు వెంకటసుబ్బయ్య పరిస్థితి విషమంగా ఉందని చెప్పటడంతో గుంటూరు నుంచి ఎర్రగొండపాలెం తరలిస్తుండగా మార్గమధ్యంలో నరసరావుపేట సమీపంలో గుండెపోటుతో మృతి చెందారని ఆయన కుమారులు తెలిపారు. ఆదివారం సా యంత్రం ఎర్రగొండపాలెంలోని హిందూ శ్మశానవాటికలో శాస్త్రోత్తంగా అంత్యక్రియలు నిర్వహించారు.

సుదీర్ఘకాలం సేవలు 

ఆర్యవైశ్య సంఘంలో, టీడీపీలో ఆయన సుదీర్ఘకాలం సేవలందించారు. ఎర్రగొండపాలెం గ్రామంలో పట్టాభి రామ స్వామి ఆలయ నిర్మాణం, వాసవీకన్యకా పరమేశ్వరిదేవి ఆలయ నిర్మాణం పూర్తి చేశారు. 20 సంవత్సరాలు వాసవీకన్యకాపరమేశ్వరిదేవి ఆలయ కమిటీ అధ్యక్షునిగా కొనసా గారు. 1982 నుంచి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకూ పార్టీలో కొనసాగారు. ఎర్రగొండపాలెం గ్రామ టీడీపీ బాధ్యతలు నిర్వహిం చారు. ఆయన మృతిపట్ల టీడీపీ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.

Updated Date - 2021-04-19T06:14:39+05:30 IST