రైల్వేలో సద్భావన దివస్‌

ABN , First Publish Date - 2022-08-20T06:31:01+05:30 IST

తూర్పు కోస్తా రైల్వే వాల్తేరు డివిజన్‌ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం సద్భావన దివస్‌ ఘనంగా జరిగింది.

రైల్వేలో సద్భావన దివస్‌
ప్రతిజ్ఞ చేస్తున్న డీఆర్‌ఎం శెత్పతీ, అధికారులు, సిబ్బంది

విశాఖపట్నం, ఆగస్టు 19: తూర్పు కోస్తా రైల్వే వాల్తేరు డివిజన్‌ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం సద్భావన దివస్‌ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి డీఆర్‌ఎం అనూప్‌కుమార్‌ శెత్పతీ ముఖ్య అతిఽథిగా హాజరై ఐక్యత, సామరస్యం పాటించి రాజ్యాంగ మార్గాల ద్వారా విభేదాల పరిష్కారాలకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఆయనతోపాటు ఇతర అధికారులు, సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా డీఆర్‌ఎం మాట్లాడుతూ భారత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా ప్రతి ఏడాది దేశ వ్యాప్తంగా సద్భావన దివస్‌ జరుగుతుందన్నారు. మతాలు, కులాలకు అతీతంగా జాతీయ సమైక్యత, సమగ్రత, శాంతి సామరస్యాలతో ముందుకు సాగడమే దివస్‌ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాంచి అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-20T06:31:01+05:30 IST