మధురలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు...Delhi Routeలో నిలిచిన రైళ్ల రాకపోకలు

ABN , First Publish Date - 2022-01-22T16:22:07+05:30 IST

యూపీలోని మధుర బృందావన్ సమీపంలోని నింబా రైల్వేస్టేషన్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది...

మధురలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు...Delhi Routeలో నిలిచిన రైళ్ల రాకపోకలు

మధుర(ఉత్తరప్రదేశ్): యూపీలోని మధుర బృందావన్ సమీపంలోని నింబా రైల్వేస్టేషన్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. సిమెంటు లోడ్ తో వెళుతున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో రెండు రైల్వే లైన్లు దెబ్బతిన్నాయి.ఈశాన్య రైల్వేలోని మథుర-పల్వాల్ సెక్షన్‌లోని భూతేశ్వర్- బృందావన్ రోడ్ స్టేషన్‌ల మధ్య రైలు పట్టాలు తప్పింది. పట్టాలు తప్పడంతో ఢిల్లీకి వెళ్లే రైలు మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయని ఆగ్ర డివిజన్ రైల్వే అధికారి శ్రీవాస్తవ చెప్పారు. 300 మందికి పైగా కార్మికులు, సిబ్బంది సిమెంటు లోడ్ చేసిన కోచ్ లను తొలగించడానికి శ్రమిస్తున్నారని రైల్వే అధికారులు చెప్పారు. 15 వ్యాగన్లు పట్టాలు తప్పాయని, వీటిని తొలగించి శనివారం సాయంత్రం వరకు రైళ్ల రాకపోకలను పునరుద్ధరిస్తామని రైల్వే అధికారులు చెప్పారు. ఢిల్లీకి వెళ్లే రూట్ లో రైళ్ల రాకపోకలు నిలిచిపోవడంతో రైలు ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.


Updated Date - 2022-01-22T16:22:07+05:30 IST