గూడెం ఆలయ హుండీ లెక్కింపు
ABN , First Publish Date - 2021-03-03T02:47:55+05:30 IST
మండలంలోని గూడెం శ్రీసత్యనారాయణ స్వామి ఆలయంలో మంగళవారం హుండీ లెక్కింపు చేపట్టారు.
దండేపల్లి, మార్చి 2: మండలంలోని గూడెం శ్రీసత్యనారాయణ స్వామి ఆలయంలో మంగళవారం హుండీ లెక్కింపు చేపట్టారు. స్వామి వారి ప్రధాన ఆలయంలో దేవదాయ ధర్మదాయ శాఖ నిర్మల్ డివిజన్ ఇన్స్పెక్టర్ రంగు రవి కిషన్గౌడ్,ఆలయ వ్యవస్ధాపక కుటుంబసభ్యులు గోవర్ధన రఘస్వామి ఆధ్వర్యంలో హుండీ లెక్కించారు. రూ.4, 81, 442 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో వడ్లూరి అనూష తెలిపారు. లెక్కింపులో ఆలయ అధికారులు, అర్చకులు, సిబ్బంది శ్రీసత్యనారాయణ స్వామిసేవాసమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.