Delhi: బాణసంచా విక్రయం, కాల్చడంపై నిషేధాస్త్రం

ABN , First Publish Date - 2021-09-29T17:33:48+05:30 IST

కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఢిల్లీ సర్కారు తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది...

Delhi: బాణసంచా విక్రయం, కాల్చడంపై నిషేధాస్త్రం

కాలుష్య నియంత్రణకు సర్కారు సంచలన నిర్ణయం

న్యూఢిల్లీ : కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఢిల్లీ సర్కారు తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జనవరి 1వతేదీ వరకు ఢిల్లీలో బాణసంచా విక్రయం, కాల్చడాన్ని నిషేధిస్తూ ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశం ప్రకారం ఢిల్లీలో వాయికాలుష్యాన్ని నివారించేందుకు బాణసంచాపై పూర్తి నిషేధం విధించినట్లు సర్కారు తెలిపింది. శీతాకాలంలో దేశ రాజధానిలో వాయు కాలుష్యం పెరుగుతుందని గుర్తించిన అధికారులు తాజా నిర్ణయం తీసుకున్నారు. 




దీపావళి, నూతన సంవత్సర వేడుకల్లో పటాకులు కాల్చడం వల్ల ఢిల్లీలో గాలిలో నాణ్యత క్షీణిస్తోంది. వాయు కాలుష్యం బారినుంచి ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఢిల్లీలో పటాకులను నిషేధించామని సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. దేశ రాజధానిలో అన్ని రకాల పటాకుల నిల్వ, అమ్మకం, వినియోగంపై నిషేధం విధిస్తున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.


Updated Date - 2021-09-29T17:33:48+05:30 IST