రైల్వే ప్రయాణీకులకు శుభవార్త.. వేసవిలో..
ABN , First Publish Date - 2022-03-20T12:10:39+05:30 IST
రైల్వే ప్రయాణీకులకు శుభవార్త.. వేసవిలో..
- 104 ప్రత్యేక రైళ్లు
హైదరాబాద్/సికింద్రాబాద్ : వేసవి కాలంలో ప్రయాణికుల రద్దీని అధిగమించేందుకు దక్షిణ మధ్య రైల్వే వేర్వేరు ప్రాంతాల నుంచి 104 ప్రత్యేక రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేసినట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్-ఎర్నాకులం ప్రత్యేక రైలు (నెంబర్: 07189) ఏప్రిల్ 1 నుంచి జూన్ 24 వరకు ప్రతి శుక్రవారం రాత్రి 9.05గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరి, మరుసటి రోజు రాత్రి 8.15 గంటలకు ఎర్నాకులం చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఎర్నాకులం-సికింద్రాబాద్ ప్రత్యేక రైలు (నెంబర్: 07190) ఏప్రిల్ 2 నుంచి జూన్ 25 వరకు ప్రతి శనివారం రాత్రి 11.25 గంటలకు ఎర్నాకులం నుంచి బయల్దేరి, మరుసటి రోజు రాత్రి 11.30 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది.
మచిలీపట్నం- కర్నూలు సిటీల మధ్య ప్రత్యేక రైలు (07067) ఏప్రిల్లో 2, 5, 7, 9, 12, 14, 16, 19, 21, 23, 26, 28, 30 తేదీల్లో, మేలో 3, 5, 7, 10, 12, 14, 17, 19, 21, 24, 26, 28, 31 తేదీల్లో, జూన్లో 2, 4, 7, 9, 11, 14, 16, 18, 21, 23,25, 28, 30 తేదీల్లో 15.50 గంటలకు మచిలీపట్నంలో బయలుదేరి మరుసటి రోజు 5.10 గంటలకు కర్నూలు చేరుతుందని వివరించారు. కర్నూలు సిటీ-మచిలీపట్నం ప్రత్యేక రైలు (07068) ఏప్రిల్లో 3, 6, 8, 10, 13, 15, 17, 20, 22, 24, 27, 29 తేదీల్లో, మేలో 1, 4, 6, 8, 11, 13,15, 18, 20,22, 25, 27, 29 తేదీల్లో, జూన్లో 1, 3, 5, 8, 10, 12, 15, 17, 19, 22, 24, 26, 29, జూలై 1వ తేదీన 20.00 గంటలకు కర్నూలులో బయలుదేరి మరుసటి రోజు 7.15 గంటలకు మచిలీపట్నం చేరుతుందని వివరించారు.