ఏపీ పెన్షనర్లకు శుభవార్త
ABN , First Publish Date - 2021-12-14T21:25:32+05:30 IST
రాష్ట్రంలోని పెన్షనర్లకు ప్రభుత్వం శుభవార్త
అమరావతి: రాష్ట్రంలోని పెన్షనర్లకు ప్రభుత్వం శుభవార్త అందించింది. 2022 జనవరి 1 నుంచి ఏపీలో పెన్షన్ పెంచుతున్నట్లు ప్రకటించింది. రెండేళ్ల తర్వాత పెన్షన్ పెంపుపై సర్కార్ నిర్ణయం తీసుకున్నది. జనవరి 1 నుంచి పెన్షన్ను రూ.2,500కి పెంచనుంది. 2019 జూన్లో రూ.250లను ప్రభుత్వం పెంచింది. ప్రతి ఏడాది పెన్షన్ను పెంచుకుంటూ పోతానని గతంలో సీఎం జగన్ హామీ ఇచ్చారు. అయితే ఏడాదిన్నరగా పెన్షన్లు పెరగలేదు. ఎట్టకేలకు జనవరి నుంచి మరో రూ.250 పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.