వంగపల్లి అభివృద్ధికి కృషి : గొంగిడి

ABN , First Publish Date - 2020-10-25T11:13:17+05:30 IST

మండలంలోని వంగపల్లి అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి తెలిపారు.

వంగపల్లి అభివృద్ధికి కృషి : గొంగిడి

యాదాద్రి రూరల్‌, అక్టోబరు 24: మండలంలోని వంగపల్లి అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి తెలిపారు. శనివారం మండలంలోని వంగపల్లి గ్రామంలో విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి నిధులు రూ.2లక్షలతో ఎల్‌ఈడీ లైట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్‌ఈడీ లైట్లతో వంగపల్లి విద్యుత్‌ కాంతులతో కలకలలాడుతుందన్నారు. మోటకొంటూరు, వంగపల్లి గ్రామాల మధ్య చీకటిని రూపుమాపి ప్రమాదాలు జరుగకుండా లైట్లు ఉపయోగపడుతాయన్నారు. వంగపల్లి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పనులుచేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామన్నారు. అనంతరం గ్రామంలోని దుర్గామాత మండపం వద్ద దుర్గామాతకు ప్రత్యేకపూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలేరు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గడ్డమీది రవీందర్‌గౌడ్‌, సర్పంచ్‌ కానుగు కవిత బాలరాజ్‌గౌడ్‌, ఉప సర్పంచ్‌ల సంఘం జిల్లా అధ్యక్షుడు రేపాక స్వామి, కానుగు భిక్షంగౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-10-25T11:13:17+05:30 IST