టీఆర్ఎస్‌పై ఈసీకి ఫిర్యాదు చేసిన గోనే ప్రకాష్‌రావు

ABN , First Publish Date - 2021-07-27T16:31:43+05:30 IST

హుజూరాబాద్‌కు వెంటనే ఉపఎన్నిక నిర్వహించాలని ఈసీకి మాజీ ఎమ్మెల్యే గోనే ప్రకాష్ రావు లేఖ రాశారు.

టీఆర్ఎస్‌పై ఈసీకి ఫిర్యాదు చేసిన గోనే ప్రకాష్‌రావు

కరీంనగర్ జిల్లా: హుజూరాబాద్‌కు వెంటనే ఉపఎన్నిక నిర్వహించాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు మాజీ ఎమ్మెల్యే గోనే ప్రకాష్ రావు లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుజూరాబాద్‌లో అధికార పార్టీ కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. టీఆర్ఎస్ ఖర్చు పెడుతున్న డబ్బులపై నిఘా పెట్టి వాటిపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఈసీని కోరినట్లు చెప్పారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలను కేంద్ర పారామిలటరీ బలగాల పర్యవేక్షణలో నిర్వహించాలని  ఆ లేఖలో పేర్కొన్నట్లు గోనే ప్రకాష్ రావు తెలిపారు.

Updated Date - 2021-07-27T16:31:43+05:30 IST