తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలపై ఈసీకి ఫిర్యాదు చేశాం: గోనె ప్రకాష్

ABN , First Publish Date - 2021-12-21T17:26:11+05:30 IST

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశానని

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలపై ఈసీకి ఫిర్యాదు చేశాం: గోనె ప్రకాష్

న్యూఢిల్లీ: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశానని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ చెప్పారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నేతృత్వంలో అరాచకాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా సారంగపూర్ జెడ్పీటీసీ పి రాజేశ్వర్ రెడ్డి నామినేషన్ వేశారని, ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేసి నామినేషన్ వెనక్కి తీసుకున్నట్టు పత్రాలు సమర్పించారన్నారు. దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘం, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. దీంతో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు గోనె ప్రకాష్ తెలిపారు.

Updated Date - 2021-12-21T17:26:11+05:30 IST