యాసిడ్ దాడి కేసులో నిందితుడిపై పోలీసుల కాల్పులు, అరెస్ట్

ABN , First Publish Date - 2020-10-14T21:41:34+05:30 IST

ముగ్గురు దళిత మైనర్ బాలికలపై యాసిడ్ దాడి చేసిన నిందితుడిని యూపీ పోలీసులు అరెస్టు చేశారు....

యాసిడ్ దాడి కేసులో నిందితుడిపై పోలీసుల కాల్పులు, అరెస్ట్

గోండా (ఉత్తరప్రదేశ్): ముగ్గురు దళిత మైనర్ బాలికలపై యాసిడ్ దాడి చేసిన నిందితుడిని యూపీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు బైక్ పై పారిపోతూ పిస్టల్ తో కాల్పులు జరపగా పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నిందితుడు గాయపడ్డాడు. నిందితుడి నుంచి బైక్ ను స్వాధీనం చేసుకున్నామని, గాయపడిన నిందితుడిని అరెస్టు చేసి, ఆసుపత్రికి తరలించామని పోలీసులు చెప్పారు. నిందితుడి నుంచి పిస్టల్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు యాసిడ్ దాడి ఎందుకు చేశాడనేది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దళితవర్గానికి చెందిన ముగ్గురు సోదరిమణులపై గుర్తుతెలియని వ్యక్తి యాసిడ్ తో దాడి చేశాడు.  


గోండా పట్టణానికి చెందిన 8,12,17 సంవత్సరాల వయసు గల ముగ్గురు దళిత సోదరీమణులు సోమవారం రాత్రి నిద్రపోతుండగా వారిపై ఓ వ్యక్తి ఒకరు యాసిడ్ తో దాడి చేశాడు. ఈ దాడిలో ఇద్దరు బాలికలకు స్వల్పంగా కాలిన గాయాలయ్యాయి. మరో బాలిక ముఖంపై గాయమైంది. యాసిడ్ దాడిలో గాయపడిన ముగ్గురు బాలికలను జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు.

Updated Date - 2020-10-14T21:41:34+05:30 IST