గొల్లవిల్లికి ప్రత్యేక వైద్య బృందాలను పంపండి: పవన్
ABN , First Publish Date - 2021-05-12T22:08:09+05:30 IST
గొల్లవిల్లి గ్రామంలో కరోనా విజృంభణపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. 40 శాతం మంది ప్రజలు కరోనా బారినపడ్డారని..
అమరావతి: గొల్లవిల్లి గ్రామంలో కరోనా విజృంభణపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. 40 శాతం మంది ప్రజలు కరోనా బారినపడ్డారని.. 5వేల మంది ప్రజలున్న చిన్న గ్రామం ఇప్పుడు కరోనాతో విలవిల్లాడుతున్న వైనం బాధించిందన్నారు. కరోనా కారణంగా ఇప్పటికే 20 మంది కన్నుమూశారనే విషయం ఆవేదన కలిగించిందన్నారు. ప్రభుత్వ యంత్రాంగం గొల్లవిల్లి గ్రామం విషయంలో ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. రెడ్ జోన్ ప్రకటించి, బ్లీచింగ్ చల్లిస్తే అక్కడి ప్రజల్లో భయాందోళనలు తగ్గవన్నారు. తక్షణమే ప్రత్యేక వైద్య బృందాలను అక్కడకు పంపించాలని విజ్ఞప్తి చేశారు. ఆ గ్రామ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. ఇంటింటి ఆరోగ్య సర్వే, పరీక్షలు చేసి మందులు సరఫరా చేయాలని కోరారు.