గొల్లపూడిలో దేవినేని అరెస్ట్
ABN , First Publish Date - 2021-10-20T14:04:18+05:30 IST
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ దాడికి నిరసనగా టీడీపీ రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చింది. బంద్ పిలుపు నేపథ్యంలో జిల్లాలో ఎక్కడకక్కడ టీడీపీ ముఖ్య నాయకులను పోలీసులు
విజయవాడ: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ దాడికి నిరసనగా టీడీపీ రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చింది. బంద్ పిలుపు నేపథ్యంలో జిల్లాలో ఎక్కడకక్కడ టీడీపీ ముఖ్య నాయకులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఈ నేపథ్యంలో గొల్లపూడిలో టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమను పోలీసులు అరెస్ట్ చేసి నున్న పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ నేపథ్యంలో దేవినేని ఉమ మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులు, జగన్ ప్రభుత్వం ప్రజల స్వేచ్ఛను హరిస్తోందన్నారు. ఏపీలో ఆటవిక పాలన సాగుతోందని, అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదని, ఇప్పటికైనా సీఎం జగన్ తెలుసుకోవాలని దేవినేని సూచించారు.