గొల్లకురుమల సమస్యలను పరిష్కరించాలి : రవీందర్‌

ABN , First Publish Date - 2022-05-24T05:07:32+05:30 IST

గొల్లకురుమలు ఎదుర్కుంటున్న సమస్యలను పరిష్కరించాలని గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఉడుత రవీందర్‌ అన్నారు.

గొల్లకురుమల సమస్యలను పరిష్కరించాలి : రవీందర్‌

చేర్యాల, మే 23: గొల్లకురుమలు ఎదుర్కుంటున్న సమస్యలను పరిష్కరించాలని గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఉడుత రవీందర్‌ అన్నారు. కొమురవెల్లి మండల కేంద్రంలోని టీటీడీ కల్యాణ మండపంలో ఆలేటి యాదగిరి అధ్యక్షతన జరిగిన జిల్లా మహాసభలో ఆయన మాట్లాడారు. మొదటివిడత గొర్రెలు ప్రభుత్వం ఇప్పటికీ పూర్తిగా పంపిణీ చేయకపోగా, రెండో విడత గొర్రెల పంపిణీ చేపట్టకపోవడం తగదన్నారు. 50 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరికీ రూ.5 వేల పెన్షన్‌ అందించాలని, ప్రమాదంలో చనిపోయిన వారికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలని, సొసైటీకి కమ్యూనిటీ భవనం నిర్మించి యువకులకు రూ.30 లక్షలతో గోట్‌ఫారం ఏర్పాటు చేయాలని కోరారు. అంతకుముందు మల్లన్న ఆలయ వీధుల గుండా డోలు చప్పుళ్ల నడుమ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు దాసరి బాలరాజు, ఆలేటి రజిత, బియ్య సిద్ధులు, సత్తయ్య, మీస మల్లయ్య, తిరుపతి, ఇరుమల్ల ప్రశాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-24T05:07:32+05:30 IST