వైసీపీ అధిష్టానంపై రగిలిపోతున్న పాయకరావు పేట ఎమ్మెల్యే
ABN , First Publish Date - 2022-04-19T18:11:20+05:30 IST
అమరావతి: పాయకరావు పేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు మళ్లీ ధిక్కారస్వరం వినిపించారు.
అమరావతి: పాయకరావు పేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు మళ్లీ ధిక్కారస్వరం వినిపించారు. మంత్రి పదవి రాకపోవడంపై తన కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. తాను అమాయకుడిని కాదని, నూటికి నూరు శాతం హింసా వాదినని, లక్షమందితో మీటింగ్ పెట్టి చెప్పమన్నా చెప్తానన్నారు. జైల్లో పెట్టినా భయపడేది లేదని చెప్పిన మాటే చెప్పారు. సింహంలా ఉంటానని, సింహంలానే బతుకుతానని గొల్ల బాబూరావు అన్నారు.