బీజేపీ పాలనలో తిరోగమనమే: గోలి శ్రీనివాస్రెడ్డి
ABN , First Publish Date - 2022-07-03T05:58:30+05:30 IST
బీజేపీ పాలనలో తిరోగమనమే: గోలి శ్రీనివాస్రెడ్డి
ఆమనగల్లు, జూలై 2: ప్రధాని మోది నాయకత్వంలోని 8ఏళ్ల బీజేపీ పాలనలో అంతా తిరోగమనమే తప్ప సాధించిన ప్రగతి ఏమీ లేదని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గోలి శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. పట్టణంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో ఆదిపత్యం కోసం బీజేపీ నీచ రాజకీయాలకు ఒడిగట్టిందన్నారు. దేశంలో బీజేపీయేతర పాలిత రాష్ట్రాల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఆయా ప్రభుత్వాలను కూల్చడమే బీజేపీ పనిగా పెట్టుకుందన్నారు. సమావేశంలో జక్కు అనంత రెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, సురమల్ల సుభాష్, రూపం వెంకట్ రెడ్డి, శివ, కసిరెడ్డి సాయినాథ్రెడ్డి, ఈర్లపల్లి రవికుమార్ పాల్గొన్నారు.