స్వర్ణకారుడు ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-07-04T04:56:03+05:30 IST

స్థానిక శాంతకుమారివీధి వాసి స్వర్ణకారుడు ఖాదర్‌బాష (43) ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

స్వర్ణకారుడు ఆత్మహత్య

అప్పులే కారణమా..?

ప్రొద్దుటూరు క్రైం, జూలై 3: స్థానిక శాంతకుమారివీధి వాసి స్వర్ణకారుడు ఖాదర్‌బాష (43) ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా ఖాదర్‌బా ష ఆత్మహత్యకు అప్పులే కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ఆదివారం రాత్రి వెలుగు చూసిన ఘటనపై వివ రాల్లోకెళితే... నెల్లూరు వాసి ఖాదర్‌బా ష కొన్నేళ్ల కిందటే భార్య పిల్లలతో ప్రొద్దుటూరుకు వచ్చి స్వర్ణకారుడిగా స్థిరపడ్డాడు. ఇటీవల ఖాదర్‌బాష భా ర్య, ఇద్దరు కుమార్తెలతో నెల్లూరు వెళ్లింది.

దీంతో ఖాదర్‌బాష ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు. కాగా దుకాణం గుమాస్తా ఆదివారం ఫోన్‌ చేసి మాట్లాడాడు. తర్వాత ఫోన్‌ చేస్తే లిఫ్ట్‌ చేయలేదు. దీంతో అతను యజమాని ఇంటికి వచ్చి చూడగా, ఖాదర్‌బాష ఉ రేసుకుని వేలాడుతూ కన్పించాడు. దీంతో వెంటనే పోలీసులకు సమాచా రం ఇచ్చాడు. ఎస్‌ఐ డాక్టర్‌ నాయక్‌ సంఘటనా స్థలానికి వెళ్లి, మృతదేహా న్ని పరిశీలించి, భార్యపిల్లలకు సమాచారం ఇచ్చారు. ఆత్మహత్యకు గల కా రణాలపై ఆరా తీశారు. మృతదేహన్ని జిల్లాఆస్పత్రికి తరలించారు.

Updated Date - 2022-07-04T04:56:03+05:30 IST