యాదాద్రి లక్ష్మీనృసింహుడికి బంగారు ప్రమిద

ABN , First Publish Date - 2021-06-20T12:28:29+05:30 IST

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామికి నగరంలోని

యాదాద్రి లక్ష్మీనృసింహుడికి బంగారు ప్రమిద

  • రూ.53లక్షల వ్యయంతో 1130 గ్రాముల బంగారంతో తయారీ


హైదరాబాద్ సిటీ/యాదాద్రి టౌన్‌ : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామికి నగరంలోని హిమాయత్‌నగర్‌కు చెందిన భక్తులు కాముని గణేశ్‌రావు, మల్లేశ్‌ కుటుంబ సభ్యులు బంగారు ప్రమిద, వెండి స్టాండ్‌ను కానుకగా సమర్పించారు. కొండపైన ప్రధానాలయం ఎదుట దేవస్థాన ఈవో గీతారెడ్డికి దాతలు వీటిని శనివారం అందజేశారు. లాక్‌డౌన్‌ కారణంగా బాలాలయంలో భక్తులకు ప్రవేశం లేకపోవడంతో దాతల నుంచి కానుకలు ప్రధానాలయం చెంత తీసుకున్నట్లు ఈవో గీతారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా దాతలు విలేకరులతో మాట్లాడుతూ తల్లిదండ్రులు రామయ్య, మణెమ్మల జ్ఞాపకార్థం సుమారు రూ.53లక్షలతో 1130 గ్రాముల బంగారంతో స్వర్ణ ప్రమిద, సుమారు రూ.56వేల వ్యయంతో 800 గ్రాముల వెండి స్టాండ్‌ను తయారు చేయించినట్లు తెలిపారు.

Updated Date - 2021-06-20T12:28:29+05:30 IST