చెప్పుల్లో దాచి బంగారం స్మగ్లింగ్‌

ABN , First Publish Date - 2021-12-15T14:46:48+05:30 IST

పాదరక్షకుల్లో దాచి స్మగ్లింగ్‌ చేస్తున్న బంగారాన్ని చెన్నై ఎయిర్‌పోర్టు కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఆరుగురు ప్రయాణికులను పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై ఇంటర్నేషనల్‌ ఎయిర్‌

చెప్పుల్లో దాచి బంగారం స్మగ్లింగ్‌

                              - ఆరుగురి అరెస్టు 


అడయార్‌(చెన్నై): పాదరక్షకుల్లో దాచి స్మగ్లింగ్‌ చేస్తున్న బంగారాన్ని చెన్నై ఎయిర్‌పోర్టు కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఆరుగురు ప్రయాణికులను పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుకు సోమవారం రాత్రి శ్రీలంక నుంచి శ్రీలంకన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం ఒకటి వచ్చింది. ఈ విమాన ప్రయాణికుల వద్ద కస్టమ్స్‌ అధికారులు తనిఖీలు చేశారు. అప్పుడు ఆరుగురు ప్రయాణికులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని ఒక గదిలోకి తీసుకెళ్ళి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వీరిలో ఇద్దరు ప్రయాణికులు ధరించిన చెప్పుల్లో దాచి అక్రమంగా బంగారం ప్యాకెట్లను తీసుకొచ్చినట్టు గుర్తించారు. మిగిలిన నలుగురు ప్రయాణికులు తమ లోదుస్తుల్లో బంగారాన్ని దాచి తీసుకొచ్చారు. ఈ ఆరుగురు ప్రయాణికుల నుంచి4 మొత్తం 928 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - 2021-12-15T14:46:48+05:30 IST