శంషాబాద్ ఎయిర్పోర్టులో బంగారం పట్టివేత
ABN , First Publish Date - 2022-01-01T02:22:36+05:30 IST
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న 234 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.
శంషాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న 234 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. షార్జా నుంచి వస్తున్న ప్రయాణికుడు ప్యాంట్లో ప్రత్యేక జేబు కుట్టించుకుని అందులో బంగారాన్ని తీసుకొస్తుండగా ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో గుర్తించారు. అధికారులు బంగారాన్ని స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. పట్టుబడ్డ బంగారం విలువ దాదాపు రూ.11.54 లక్షలు ఉంటుందని అధికారులు వెల్లడించారు.