ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత

ABN , First Publish Date - 2022-08-19T05:04:46+05:30 IST

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అక్రమంగా తీసుకొస్తున్న

ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత
పట్టుబడిన బంగారం

శంషాబాద్‌ రూరల్‌, ఆగస్టు 18:  శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అక్రమంగా తీసుకొస్తున్న బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాఽధీనం చేసుకున్నారు. షార్జా నుంచి ఓ ప్రయాణికుడు 6ఈ1406 విమానంలో గురువారం తెల్లవారుజామున శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాడు. విమానాశ్రయంలో అధికారులు తనిఖీ చేయగా అతడి వద్ద ఎలక్ట్రికల్‌ బెండల్స్‌, స్యాండల్స్‌లో 435.7గ్రాముల బంగారాన్ని గుర్తించారు. ఈ మేరకు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారం విలువ దాదాపు రూ.23.14లక్షలు ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 



Updated Date - 2022-08-19T05:04:46+05:30 IST