ఎయిర్పోర్టులో బంగారం పట్టివేత
ABN , First Publish Date - 2022-08-14T05:01:54+05:30 IST
ఎయిర్పోర్టులో బంగారం పట్టివేత
శంషాబాద్, ఆగస్టు 13: అక్రమంగా తీసుకొస్తున్న బంగారాన్ని శంషాబాద్ ఎయిర్పోర్టు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన 6ఈ 025 విమానంలో శనివారం కొందరు ప్రయాణికులు లగేజీ బ్యాగు చక్రాల బోల్టుల్లో బం గారాన్ని తీసుకొస్తుండగా కస్టమ్స్ అధికారులు తనిఖీల్లో గుర్తించారు. 154.72గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. పట్టుబడిన బంగారం విలువ రూ.8.04లక్షలు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.