ఎయిర్పోర్టులో బంగారం పట్టివేత
ABN , First Publish Date - 2022-08-13T05:23:45+05:30 IST
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో
శంషాబాద్, ఆగస్టు 12 : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విదేశాల నుంచి అక్రమంగా తీసుకొచ్చిన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బెహరాయిన్ నుంచి జీఎఫ్ 274 విమానంలో వచ్చిన ఓ ప్రయాణికుడు శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నాడు. కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో అతడి వద్ద 272 గ్రాముల బంగారాన్ని గుర్తించారు. ఈ మేరకు బంగారాన్ని సీజ్చేసి అతన్ని అరెస్టు చేశారు. పట్టుబడిన బంగారం విలువ రూ.14లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.