మళ్లీ పెరిగిన పసిడి ధర.. ఈసారి ఎంతంటే?
ABN , First Publish Date - 2021-06-22T00:43:10+05:30 IST
గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న పసిడి ధరలు నేడు మళ్లీ పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో నేడు స్వచ్ఛమైన బంగారం
న్యూఢిల్లీ: గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న పసిడి ధర నేడు మళ్లీ పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో నేడు స్వచ్ఛమైన బంగారం ధర పది గ్రాములకు రూ. 250 పెరిగి రూ. 46,277కు చేరుకుంది. రూపాయి విలువ తగ్గడం, అంతర్జాతీయంగా విలువైన లోహాల ధర పుంజుకోవడంతోనే బంగారం ధరలు పెరిగినట్టు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ తపన్ పటేల్ తెలిపారు.
పుత్తడితోపాటే పయనించే వెండి ధర కూడా నేడు స్వల్పంగా పెరిగింది. కిలోకు రూ. 258 పెరిగి రూ. 66,842కు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్సు 1782 డాలర్లుగా ఉండగా, వెండి ధర స్వల్పంగా పెరిగి ఔన్సు ధర 26.05 డాలర్లుగా ఉంది. హైదరాబాద్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 48,600గా ఉంది.