ఆటోలో రూ.10లక్షల బంగారం!
ABN , First Publish Date - 2022-08-10T06:31:59+05:30 IST
ఆటోలో ప్రయాణికులు బ్యాగ్ మరచిపోయారని తెలిసినా వేగంగా వెళ్లిపోయి రూ. 10లక్షల విలు వైన బంగారు వస్తువులను తన వద్ద పెట్టుకున్న వ్యక్తిని పోలీసులు ఐదు గంటల్లో పట్టుకున్నారు.
ఐదు గంటల్లో ఛేదించిన పోలీసులు
విజయవాడ, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి) : ఆటోలో ప్రయాణికులు బ్యాగ్ మరచిపోయారని తెలిసినా వేగంగా వెళ్లిపోయి రూ. 10లక్షల విలు వైన బంగారు వస్తువులను తన వద్ద పెట్టుకున్న వ్యక్తిని పోలీసులు ఐదు గంటల్లో పట్టుకున్నారు. చెన్నైకి చెందిన టోట యువరాజ్ సునీల్ కుటుం బ సభ్యులతో కలిసి నగరంలో జరిగే బంధువుల వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు. ఉండవల్లిలో ఆటో ఎక్కి గురునానక్ కాలనీలోని ఎన్ఏసీ కల్యాణ మండపానికి మంగళవారం మధ్యాహ్నం వచ్చారు. ఆటో దిగే క్రమంలో బ్యాగ్ను మరిచిపోయారు. అందులో 205 గ్రాముల బంగారు ఆభరణాలు, మూడు పట్టుచీరలు, రూ.4వేలు ఉన్నాయి. పాయకాపురానికి చెందిన ఆటో డ్రైవర్ పోకల మురళీ బ్యాగ్ ను గుర్తించినా ప్రయాణికులకు ఇవ్వలేదు. పై గా అక్కడే మరో ప్రయాణికులను ఎక్కించుకుని వేగంగా వెళ్లిపోయాడు. బ్యాగ్ మరచిపోయినట్టు గుర్తించిన యువరాజ్ సునీల్ డయ ల్ 100కు కాల్ చేశారు. పటమట క్రైం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అక్కడ సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి ఆటో నంబర్ ను సంపాదించారు. దాని ఆధారంగా దర్యాప్తు చేయగా ఆటో పాయకాపురంలో ఉన్నట్టు తెలుసుకున్నారు. నిందితుడు మురళీని అరెస్టు చేసి, అతడి నుంచి మొత్తం ఆభరణాలు, వస్తువులను స్వాఽధీనం చేసుకున్నారు.