వికారాబాద్ జిల్లాలో పొలంలో బయటపడ్డ బంగారం
ABN , First Publish Date - 2020-06-03T17:39:51+05:30 IST
సుల్తాన్పూర్లో పొలంలో మొరం తవ్వుతుండగా బంగారం బయటపడింది.
వికారాబాద్ జిల్లా: సుల్తాన్పూర్లో పొలంలో మొరం తవ్వుతుండగా బంగారం బయటపడింది. బుధవారం ఉదయం సిద్ధిక్ అనే వ్యక్తి తన తండ్రితో కలిసి పొలంలో మొరం తవ్వుతుండగా బంగారం, వెండి ఆభరణాలు బయటపడ్డాయి. అవి పురాతనకాలానికి చెందిన బంగారం, వెండి వస్తువులుగా గుర్తించారు. వాటిని పోలీసులు, రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భూ యజమానిని వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.