పట్టపగలే చోరీ

ABN , First Publish Date - 2021-04-16T06:27:44+05:30 IST

మండలంలోని పులికనుమ గ్రామంలో గురువారం పట్టపగలే చోరీ జరిగింది.

పట్టపగలే చోరీ

పెద్దకడబూరు, ఏప్రిల్‌ 15: మండలంలోని పులికనుమ గ్రామంలో గురువారం పట్టపగలే చోరీ జరిగింది. బాధితుడు కోసిగి గోవిందు తెలిపిన మేరకు.. కుటుంబ సభ్యులంతా ఉదయాన్నే పొలాని వెళ్లారు. ఇంటికి వచ్చి చూడగా దొంగలు బీరువాను పగులగొట్టి రూ.50వేల నగదుతోపాటు రెండు తులాల బంగారం, 48 తులాల వెండిని అపహరించుకెళ్లారు. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపారు. దొంగలను పట్టుకొని తనకు న్యాయం చేయాలని బాధితుడు కోరాడు. 

Updated Date - 2021-04-16T06:27:44+05:30 IST