గోకుల్‌ పార్కు తీరంలో యువకుడి మృతదేహం

ABN , First Publish Date - 2020-02-20T08:29:32+05:30 IST

గోకుల్‌ పార్కు తీరంలో యువకుడి మృతదేహం

గోకుల్‌ పార్కు తీరంలో యువకుడి మృతదేహం

మహారాణిపేట, ఫిబ్రవరి 19 : ఏటీఎం కేంద్రానికి వెళతానని మంగళవారం రాత్రి ఇంట్లో చెప్పి బయటకు వెళ్లిన యువకుడు తెల్లారేసరికి గోకుల్‌ పార్కు సమీపంలో మృతదేహమై కనిపించాడు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

కంచరపాలేనికి చెందిన సూదులు రవికిరణ్‌ (22)  తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటున్నాడు.  మంగళవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో ఏటీఎంకు వెళుతున్నానని చెప్పి ఇంటి నుంచి బయటకు వచ్చాడు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ రవికిరణ్‌ తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. మహారాణిపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ నేపథ్యంలో బుధవారం తెల్లవారుజామున మహారాణిపేట పోలీసు స్టేషన్‌ పరిధిలోని గోకుల్‌పార్కు సముద్రతీరంలో రవికిరణ్‌ మృతదేహం కనిపించింది.  మహారాణిపేట పోలీసులు మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు చెప్పారు.

Updated Date - 2020-02-20T08:29:32+05:30 IST