తంటికొండ ఘటనపై సోము వీర్రాజు, శైలజానాథ్ దిగ్ర్భాంతి
ABN , First Publish Date - 2020-10-30T16:47:18+05:30 IST
తూర్పుగోదావరి జిల్లాలోని గోకవరం మండలం తంటికొండలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ఏపీసీసీ చీఫ్ శైలజానాథ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తంటికొండ ఘటన బాధాకరమని శైలజానాథ్ విచారం వ్యక్తం చేశారు. పెళ్లి
విజయవాడ: తూర్పుగోదావరి జిల్లాలోని గోకవరం మండలం తంటికొండలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ఏపీసీసీ చీఫ్ శైలజానాథ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తంటికొండ ఘటన బాధాకరమని శైలజానాథ్ విచారం వ్యక్తం చేశారు. పెళ్లి బృందం వ్యాన్ లోయలో పడడం దురదృష్టకరం.. బాధితులకు ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు శైలజానాథ్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
సోమువీర్రాజు..
తంటికొండ ఘటనపై సోమువీర్రాజు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
తూర్పుగోదావరి జిల్లాలోని గోకవరం మండలం తంటికొండ కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ట్రక్ వ్యాన్ అదుపుతప్పి కొండపై నుంచి పడిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు.