కల్యాణం.. కమనీయం
ABN , First Publish Date - 2021-01-16T05:51:23+05:30 IST
కల్యాణం.. కమనీయం
ఆమనగల్లు : వెంకటగిరి వేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం గోదారంగనాథస్వామి కల్యాణం కనుల పండువగా నిర్వహించారు. పట్టణంతో పాటు సమీప గ్రామాల ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. వేదమంత్రోచ్ఛారణలు, మేళతాళాల నడుమ స్వామివారి కల్యాణాన్ని ప్రధాన అర్చకుడు గూడ కృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో వైభవంగా జరిపించారు. అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
వైభవంగా వెంకటేశ్వరుడి కల్యాణం
షాద్నగర్ అర్బన్: షాద్నగర్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రవణానక్షాత్రాన్ని పురష్కరించుకుని గురువారం వైభవంగా లక్ష్మీ వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు ఆధ్వర్యంలో శోభాయాత్ర నిర్వహించారు. ప్రధాన అర్చకులు శ్రీనివాసచార్యులు నేతృత్వంలో కల్యాణాన్ని జరిపించారు. కార్యక్రమంలో ప్రతాప్రెడ్డి, వెంకటసాయిశ్వర్రెడ్డి, కిషోర్, సత్యనారాయణ, రాంభూపాల్ పాల్గొన్నారు.