లలితాదేవిగా దర్శనమిచ్చిన దుర్గాదేవి

ABN , First Publish Date - 2022-09-30T06:07:30+05:30 IST

దేవీ నవరాత్రుల్లో భాగంగా నాలుగో రోజు గురువారం జిల్లావ్యాప్తంగా అమ్మవారి ఆలయాల్లో దేవతామూర్తులు వివిధ అలంకరణల్లో భక్తులకు దర్శనమిచ్చారు.

లలితాదేవిగా దర్శనమిచ్చిన దుర్గాదేవి
హిందూపురంలో కొల్హాపురి లక్ష్మీదేవి అలంకరణ

హిందూపురం, సెప్టెంబరు 29: దేవీ నవరాత్రుల్లో భాగంగా నాలుగో రోజు గురువారం జిల్లావ్యాప్తంగా అమ్మవారి ఆలయాల్లో దేవతామూర్తులు వివిధ అలంకరణల్లో భక్తులకు దర్శనమిచ్చారు. పట్టణంలో దీపలక్ష్మీ అలంకరణలో వాసవీమాత, గాయత్రీదేవి రూపంలో గంధం అలంకరణలో జలదుర్గాదేవి, వైష్ణవీమాతగా మధుగిరి మారెమ్మ, అంబికాదేవిగా కొల్లాపురి ల క్ష్మీదేవి, గోధుమల అలంకరణలో స్కందమాత దేవిగా యల్లమ్మతల్లి, ప్రత్యే క అలంకరణలో రాజరాజేశ్వరిమాత భక్తులకు దర్శనమిచ్చారు. 


లేపాక్షి: స్థానిక దుర్గావీరభద్రస్వామి ఆలయంలో అమ్మవారు లలితాదేవి అలంకరణలో దర్శనమిచ్చారు. సుప్రభాతసేవ, రుద్రాభిషేకం, శ్రీచక్రార్చన, నీరాజనం, విశేష పూజలు నిర్వహించారు. ఆలయంలో ఐదోరోజు శుక్రవా రం అమ్మవారు బాలాత్రిపురసుందరి అలంకరణలో దర్శనమివ్వనున్నట్లు అర్చకులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు.


రొద్దం: మండలకేంద్రంలోని రేణుకా యల్లమ్మ, రుద్రపాదాశ్రమం, వెంకటేశ్వరస్వామి, ఆంజనేయస్వామి మరువపల్లి కోనమల్లేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రేణుకాయల్లమ్మ దేవత అన్నపూర్ణేశ్వరి అలంకరణతో దర్శనమిచ్చారు. 


సోమందేపల్లి: స్థానిక కన్యకాపరమేశ్వరీ దేవి ఆలయంలో అమ్మవారిని కాత్యాయినీ దేవి రూపంలో అలంకరించారు. ఉదయం నుంచి భక్తులు  అ మ్మవారిని దర్శించుకున్నారు. చౌడేశ్వరిదేవి, అంబాభవానీ, పెద్దమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 


మడకశిర రూరల్‌: మండలంలోని నీలకంఠాపురంలో పార్వతి దేవి వె న్న అలంకరణతో దర్శనమిచ్చింది. జమ్మానిపల్లిలో నిడిమామిడమ్మ, కల్లుమర్రిలో వీరకేతమ్మ, మెళవాయిలో చౌడేశ్వరీదేవి, ఆమిదాలగొందిలోని కను మ మారెమ్మ దేవాలయాల్లో వివిధ రూపాలో భక్తులకు దర్శనమిచ్చారు.


గోరంట్ల: పట్టణంలోని చౌడేశ్వరీ ఆలయంలో అమ్మవారిని అర్ధనారీశ్వరీ దేవిగా అలంకరించారు. గుమ్మయ్యగారిపల్లి మారెమ్మ ఆలయంలో అమ్మవారిని బాలాత్రిపురసుందరిగా అలంకరించి, అన్నదానం చేశారు.


పెనుకొండ: స్థానిక కన్యకాపరమేశ్వరీ ఆలయంలో అమ్మవారిని గాజుల అలంకరణలో, లక్ష్మీవెంకటరమణస్వామి ఆలయంలో స్వామివారిని చందన రూపంలో అలంకరించారు. విశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.


ఆకట్టుకున్న బొమ్మల కొలువు

మడకశిరటౌన: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పట్టణంలోని వెంకటేశ్వరస్వామి ఆలయ ఆవరణలోని అర్చకుల ఇంట్టో బొమ్మల కొలువు ఆకట్టుకుంటోంది. గురువారం పట్టణంలోని వివిధ దేవాలయాల్లో విశేష పూజ లు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. కన్యకాపరమేశ్వరీ ఆలయంలో అమ్మవారు గంధం అలంకరణలో కొలువు దీరారు. గంగాభవాని, కొల్లాపుర మ్మ, ఊరిమారమ్మ, ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 


Updated Date - 2022-09-30T06:07:30+05:30 IST