రెండవ ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తున్న గోదావరి
ABN , First Publish Date - 2020-08-16T01:21:05+05:30 IST
కూనవరం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక దాటి గోదావరి ప్రవహిస్తోంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద ఒకటో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.
రాజమండ్రి: కూనవరం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక దాటి గోదావరి ప్రవహిస్తోంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద ఒకటో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. బ్యారేజీ వద్ద 13 అడుగులకు నీటి మట్టం పెరిగింది. 11.69 లక్షలు క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల చేశారు. ఇప్పటికే భారీ వర్షాలకు లోతట్టు గ్రామాల్లో రహదారులు నీట మునిగాయి. దేవీపట్నం మండలంలో 30 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. విలీన మండలాల్లో 30 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తూర్పుగోదావరి జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు కారణంగా ఆదివారం కర్ప్యూ నిబంధనలను అదికారులు సడలించారు. ఆదివారం యధావిధిగా షాపులు తెరుచుకునేందుకు అనుమతిచ్చారు.