Flood victims: ఏలూరులో గోదావరి వరద బాధితుల ఆగ్రహం
ABN , First Publish Date - 2022-07-20T17:33:33+05:30 IST
జిల్లాలోని కుక్కునూరు మండలం శ్రీధర వేలేరులో గోదావరి వరద బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏలూరు: జిల్లాలోని కుక్కునూరు మండలం శ్రీధర వేలేరులో గోదావరి(Godavari) వరద బాధితులు(Flood victims) ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం(YCP government)పై, ఎమ్మెల్యే బాలరాజు(Balaraju)పై బాధితులు మండిపడుతున్నారు. ఆంధ్ర(Andhra), తెలంగాణ(Telangana) సరిహద్దులోని ముంపు గ్రామాలను గాలికి వదిలేసారని ఆరోపించారు. గ్రామం మొత్తం గోదావరి వరదలకు నీట మునిగితే కనీసం పునరావాసం కల్పించలేదని ఆవేదన చెందారు. పిల్లా పాపలతో ఆకలితో అలమటిస్తున్నామని తెలిపారు. ఎన్నికల సమయంలో ఓటు అడగటానికి వచ్చిన ఎమ్మెల్యే బాలరాజు... మళ్ళీ తమ గ్రామం మొహం చూడడానికి రాలేదని బాధితులు ఆగ్రహించారు. గ్రామస్తులకు అధికారులు కనీసం నిత్యావసరాలు కూడా అందించకుండా ఇబ్బందులకు గురిచేశారు. ‘‘మేము తెలంగాణకు చెందిన వాళ్ళమా, ఆంధ్రాకు చెందిన వాళ్ళమో’’ అధికారులు చెప్పాలని వరద బాధితులు మండిపడుతున్నారు.