పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద ఉధృతి
ABN , First Publish Date - 2022-07-13T12:57:04+05:30 IST
పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద ఉధృతి కొనసాగుతుంది. స్పిల్వే వద్ద 34.3 మీటర్ల నీటిమట్టం నమోదైంది. అప్రమత్తమైన అధికారులు 48
ఏలూరు: పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద ఉధృతి కొనసాగుతుంది. స్పిల్వే వద్ద 34.3 మీటర్ల నీటిమట్టం నమోదైంది. అప్రమత్తమైన అధికారులు 48 గేట్లను ఎత్తి దిగువకు 12.84 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేశారు. వరద నీటి ప్రవాహంతో పోలవరం ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. పోలీస్ చెక్ పోస్టును వరద నీరు చుట్టుముట్టింది. ప్రాజెక్టు ప్రధాన రహదారిపై వరద నీటిమట్టం 14 అడుగుల చేరడంతో ప్రాజెక్టులోకి రాకపోకలు నిలిపివేశారు.