నిలకడగా గోదావరి

ABN , First Publish Date - 2022-08-13T06:45:59+05:30 IST

ఎగువన వరద తగ్గుముఖం పట్టడంతో ధవళేశ్వరం వద్ద గోదావరి నిలకడగా కొనసాగుతుంది.

నిలకడగా గోదావరి
వరద ఉధృతంగా ఉండడంతో ధవళేశ్వరం వద్ద ఒడ్డుకు చేరిన బోట్లు

ఎగువన భద్రాచలం వద్ద తగ్గుముఖం పట్టిన వరద


ధవళేశ్వరం/కొవ్వూరు, ఆగస్టు 12 : ఎగువన వరద తగ్గుముఖం పట్టడంతో  ధవళేశ్వరం వద్ద గోదావరి నిలకడగా కొనసాగుతుంది. శుక్ర వారం రాత్రి 7గంటలకు నీటిమట్టం 15 అడుగులుగా ఉండగా 14,76,919 క్యూసె క్కులు దిగువకు విడుదల చేశారు. అర్ధరాత్రి నుంచి నీటిమట్టం తగ్గుముఖం పట్టవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువన భద్రాచలం వద్ద శుక్రవారం ఉదయం 9 గంటలకు తగ్గుదల నమోదు చేసుకుంది. అయినా దిగువన ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజ్‌ వద్ద ప్రమాద హెచ్చరికలు కొనసాగుతూనే ఉన్నాయి. కొవ్వూరు గోష్పాదక్షేత్రంలో ఆలయాలన్ని రెండో రోజు వరదనీటిలోనే ఉన్నాయి. ఆలయ ప్రాంగణాలలో వరదనీరు చేరడంతో ఆలయాలను మూసివేశారు. నదీ ప్రవాహాం ఉదృతంగా ప్రవహిస్తుండడంతో గోదావరి చెంతకు ఎవ్వరు వెళ్లకుండా పోలీసు గస్తీ ఏర్పాటుచేశారు.గోదావరికి వరద ఉధృతి కొనసాగుతుండడంతో ఏ సమయంలో ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని నదీ పరివాహక ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు.     

Updated Date - 2022-08-13T06:45:59+05:30 IST